Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 09:22 AM

చింతలపూడి సచివాలయ సిబ్బంది నగర పంచాయతీ అర్బన్‌లో విలీనం

చింతలపూడి సచివాలయ సిబ్బంది నగర పంచాయతీ అర్బన్‌లో విలీనం

చింతలపూడి సచివాలయ సిబ్బంది నగర పంచాయతీ అర్బన్‌లో విలీనం
February 26, 2026 08:07 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పట్టణ అభివృద్ధికి వేగం.. పరిపాలన సమర్థతకు కొత్త దిశ

ఏలూరు జిల్లా చింతలపూడి సచివాలయ సిబ్బందిని నగర పంచాయతీ (అర్బన్)లో పూర్తిస్థాయిలో విలీనం చేసినట్లు నగర్ కమిషనర్ అంబటి రాంబాబు తెలిపారు. పట్టణ పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సేవల అందజేతను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.నగర పంచాయతీ అర్బన్ నిర్మాణాన్ని పటిష్టం చేయడంతో పాటు, పరిపాలన ప్రక్రియను సమగ్రంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసి, చింతలపూడి పట్టణ స్వరూపాన్ని అభివృద్ధి దిశగా మలిచేందుకు కృషి చేస్తున్న శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్కు కమిషనర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విలీనంతో పట్టణంలో పౌర సేవలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News