PRINT TIME: February 26, 2026 10:25 PM
చింతలపూడి సచివాలయ సిబ్బంది నగర పంచాయతీ అర్బన్లో విలీనం
చింతలపూడి సచివాలయ సిబ్బంది నగర పంచాయతీ అర్బన్లో విలీనం
February 26, 2026 08:07 PM
15 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
పట్టణ అభివృద్ధికి వేగం.. పరిపాలన సమర్థతకు కొత్త దిశ
ఏలూరు జిల్లా చింతలపూడి సచివాలయ సిబ్బందిని నగర పంచాయతీ (అర్బన్)లో పూర్తిస్థాయిలో విలీనం చేసినట్లు నగర్ కమిషనర్ అంబటి రాంబాబు తెలిపారు. పట్టణ పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, సేవల అందజేతను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.నగర పంచాయతీ అర్బన్ నిర్మాణాన్ని పటిష్టం చేయడంతో పాటు, పరిపాలన ప్రక్రియను సమగ్రంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసి, చింతలపూడి పట్టణ స్వరూపాన్ని అభివృద్ధి దిశగా మలిచేందుకు కృషి చేస్తున్న శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్కు కమిషనర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విలీనంతో పట్టణంలో పౌర సేవలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి