Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:39 AM

చిట్యాలలో పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

చిట్యాలలో పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

చిట్యాలలో పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
12-03-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మండల వ్యాప్తంగా 417 మంది విద్యార్థులు హాజరు , 3 కేంద్రాలు ఏర్పాటు.

పరీక్ష హాలులోకి పౌచులు, బాక్సులు అనుమతి లేదు

నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు చిట్యాల మండల విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ చిట్యాల ​మండల వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది

​మొత్తం 417 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 238 మంది బాలురు, 179 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి 221 మంది, ప్రైవేట్ పాఠశాలల నుండి 196 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిట్యాల గ్రీన్ గ్రోవ్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు . పరీక్షా కేంద్రాలలో మొత్తం 34 మంది సిబ్బందిని నియమించారు అందులో 28 మంది ఇన్విజిలేటర్లు ఆరుగురు టీఎస్ బి ఓ లు ను నియమించారు పరీక్షా సమయానికి గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ సూచనల మేరకు ఐదు నిమిషాల ఆలస్యంతో పరీక్ష కేంద్రానికి అనుమతి ఇస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి కవర్లు గాని, పౌచులు గాని, జామెంట్రీ బాక్సులు గాని పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు. విద్యార్థులు కేవలం పెన్నులు, పెన్సిల్లు, స్కేలు, వంటి పరీక్షా సామాగ్రి మాత్రమే పరీక్షా గదిలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా అన్ని కేంద్రాల్లో కనీస వసతులు కల్పించామని సైదా నాయక్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరారు.

Sthanikam

చిట్యాలలో పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Article Image

మండల వ్యాప్తంగా 417 మంది విద్యార్థులు హాజరు , 3 కేంద్రాలు ఏర్పాటు.

పరీక్ష హాలులోకి పౌచులు, బాక్సులు అనుమతి లేదు

నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు చిట్యాల మండల విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ చిట్యాల ​మండల వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది

​మొత్తం 417 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 238 మంది బాలురు, 179 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి 221 మంది, ప్రైవేట్ పాఠశాలల నుండి 196 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిట్యాల గ్రీన్ గ్రోవ్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు . పరీక్షా కేంద్రాలలో మొత్తం 34 మంది సిబ్బందిని నియమించారు అందులో 28 మంది ఇన్విజిలేటర్లు ఆరుగురు టీఎస్ బి ఓ లు ను నియమించారు పరీక్షా సమయానికి గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ సూచనల మేరకు ఐదు నిమిషాల ఆలస్యంతో పరీక్ష కేంద్రానికి అనుమతి ఇస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి కవర్లు గాని, పౌచులు గాని, జామెంట్రీ బాక్సులు గాని పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు. విద్యార్థులు కేవలం పెన్నులు, పెన్సిల్లు, స్కేలు, వంటి పరీక్షా సామాగ్రి మాత్రమే పరీక్షా గదిలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా అన్ని కేంద్రాల్లో కనీస వసతులు కల్పించామని సైదా నాయక్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News