Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:27 PM

చిట్యాలలో పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

చిట్యాలలో పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

చిట్యాలలో పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
March 12, 2026 07:09 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మండల వ్యాప్తంగా 417 మంది విద్యార్థులు హాజరు , 3 కేంద్రాలు ఏర్పాటు.

పరీక్ష హాలులోకి పౌచులు, బాక్సులు అనుమతి లేదు

నెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు చిట్యాల మండల విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ చిట్యాల ​మండల వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది

​మొత్తం 417 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 238 మంది బాలురు, 179 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి 221 మంది, ప్రైవేట్ పాఠశాలల నుండి 196 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చిట్యాల గ్రీన్ గ్రోవ్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, న్యూ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు . పరీక్షా కేంద్రాలలో మొత్తం 34 మంది సిబ్బందిని నియమించారు అందులో 28 మంది ఇన్విజిలేటర్లు ఆరుగురు టీఎస్ బి ఓ లు ను నియమించారు పరీక్షా సమయానికి గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ సూచనల మేరకు ఐదు నిమిషాల ఆలస్యంతో పరీక్ష కేంద్రానికి అనుమతి ఇస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థులు ఎటువంటి కవర్లు గాని, పౌచులు గాని, జామెంట్రీ బాక్సులు గాని పరీక్షా కేంద్రాల్లోనికి తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు. విద్యార్థులు కేవలం పెన్నులు, పెన్సిల్లు, స్కేలు, వంటి పరీక్షా సామాగ్రి మాత్రమే పరీక్షా గదిలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా అన్ని కేంద్రాల్లో కనీస వసతులు కల్పించామని సైదా నాయక్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News