చిట్యాలలో మానవతా ఉదాహరణ… స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన పాఠశాల మిత్రులు
చిట్యాలలో మానవతా ఉదాహరణ… స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన పాఠశాల మిత్రులు
Komidala Mahender reddy
చిట్యాల పట్టణ కేంద్రం 9వ వార్డ్కు చెందిన మునుగోటి వెంకన్న మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో, ఆయనతో కలిసి చిట్యాల ZPHS పాఠశాలలో 2006–2007 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న సహపాఠులు మానవతా విలువలను చాటారు.
వెంకన్న కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే ఉద్దేశంతో మిత్రులు కలిసి రూ.1,23,000 సేకరించారు. ఈ మొత్తాన్ని చిట్యాల పోస్టాఫీస్లో వెంకన్న కుమార్తె రేణుక పేరుతో ‘ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి యోజన’ పథకం కింద డిపాజిట్ చేశారు. అనంతరం సంబంధిత పత్రాలను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా, భవిష్యత్తులో కూడా తమకు వీలైనంత సహాయం చేస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుండాల నరేష్ గౌడ్, దమ్మల నరేందర్ రెడ్డి, చిన్నపాక నాగరాజు, జిట్టా శేఖర్, కూరాకుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
స్నేహబంధం కేవలం జ్ఞాపకాలకే పరిమితం కాకుండా, అవసర సమయంలో అండగా నిలవడం ద్వారా చిట్యాల యువత ఆదర్శంగా నిలిచింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి