Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు
March 09, 2026 01:52 PM 176 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతు కూలీల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి

చిట్యాల మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు మరియు పిచ్చి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిట్యాల మున్సిపల్ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, పాలకవర్గ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, గ్రామాల్లో మరియు మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. అలాగే వీధుల్లో తిరుగుతున్న పిచ్చి కుక్కలు ప్రజలకు ప్రమాదకరంగా మారాయని, చిన్నపిల్లలు మరియు వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా చిట్యాల మున్సిపల్ పరిధిలో రైతులు మరియు రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు, రైతు కూలీల సమస్యలు పరిష్కరించేందుకు ఒక కేంద్రంగా ఈకార్యాలయంఉపయోగపడుతుందని తెలిపారు. సమస్యలపై అధికారులు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News