Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:46 AM

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు
09-03-2026 188 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతు కూలీల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి

చిట్యాల మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు మరియు పిచ్చి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిట్యాల మున్సిపల్ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, పాలకవర్గ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, గ్రామాల్లో మరియు మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. అలాగే వీధుల్లో తిరుగుతున్న పిచ్చి కుక్కలు ప్రజలకు ప్రమాదకరంగా మారాయని, చిన్నపిల్లలు మరియు వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా చిట్యాల మున్సిపల్ పరిధిలో రైతులు మరియు రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు, రైతు కూలీల సమస్యలు పరిష్కరించేందుకు ఒక కేంద్రంగా ఈకార్యాలయంఉపయోగపడుతుందని తెలిపారు. సమస్యలపై అధికారులు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

Article Image

రైతు కూలీల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి

చిట్యాల మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు మరియు పిచ్చి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిట్యాల మున్సిపల్ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, పాలకవర్గ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, గ్రామాల్లో మరియు మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. అలాగే వీధుల్లో తిరుగుతున్న పిచ్చి కుక్కలు ప్రజలకు ప్రమాదకరంగా మారాయని, చిన్నపిల్లలు మరియు వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా చిట్యాల మున్సిపల్ పరిధిలో రైతులు మరియు రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు, రైతు కూలీల సమస్యలు పరిష్కరించేందుకు ఒక కేంద్రంగా ఈకార్యాలయంఉపయోగపడుతుందని తెలిపారు. సమస్యలపై అధికారులు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News