చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు
చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు
Komidala Mahender reddy
రైతు కూలీల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి
చిట్యాల మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు మరియు పిచ్చి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిట్యాల మున్సిపల్ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, పాలకవర్గ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు.
రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, గ్రామాల్లో మరియు మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. అలాగే వీధుల్లో తిరుగుతున్న పిచ్చి కుక్కలు ప్రజలకు ప్రమాదకరంగా మారాయని, చిన్నపిల్లలు మరియు వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా చిట్యాల మున్సిపల్ పరిధిలో రైతులు మరియు రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు, రైతు కూలీల సమస్యలు పరిష్కరించేందుకు ఒక కేంద్రంగా ఈకార్యాలయంఉపయోగపడుతుందని తెలిపారు. సమస్యలపై అధికారులు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి