Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:10 AM

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు

చిట్యాలలో కోతులు పందులు పిచ్చి కుక్కల బెడదపై మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు
March 09, 2026 01:52 PM 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతు కూలీల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి

చిట్యాల మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు మరియు పిచ్చి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిట్యాల మున్సిపల్ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, పాలకవర్గ కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.

రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, గ్రామాల్లో మరియు మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. అలాగే వీధుల్లో తిరుగుతున్న పిచ్చి కుక్కలు ప్రజలకు ప్రమాదకరంగా మారాయని, చిన్నపిల్లలు మరియు వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా చిట్యాల మున్సిపల్ పరిధిలో రైతులు మరియు రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. ఇందుకోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు, రైతు కూలీల సమస్యలు పరిష్కరించేందుకు ఒక కేంద్రంగా ఈకార్యాలయంఉపయోగపడుతుందని తెలిపారు. సమస్యలపై అధికారులు త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News