PRINT TIME: May 31, 2026 12:59 AM
చిట్యాలలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శ
చిట్యాలలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శ
May 29, 2026 07:53 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ఇటీవల జరిగిన ఆకస్మిక అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని వార్డ్ కౌన్సిలర్ షబానా అజీమ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారు, జరిగిన నష్టంపై ఆరా తీశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొబ్బలి శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్ యాదవ్, రావుల వెంకన్న, మాసపల్లి వెంకన్న, గౌస్ పాషా, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి