PRINT TIME: April 10, 2026 04:48 AM
చిట్యాల వైన్ షాపుల్లో చోరీ సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు
చిట్యాల వైన్ షాపుల్లో చోరీ సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు
February 02, 2026 12:01 PM
425 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న వైన్ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి చొరబడి సుమారు రూ.25 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉదయం షాపు తెరిచి చూసిన సమయంలో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి