Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:37 PM

చిట్యాల వైన్ షాపుల్లో చోరీ సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు

చిట్యాల వైన్ షాపుల్లో చోరీ సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు

చిట్యాల వైన్ షాపుల్లో చోరీ సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు
February 02, 2026 12:01 PM 430 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న వైన్ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి చొరబడి సుమారు రూ.25 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉదయం షాపు తెరిచి చూసిన సమయంలో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News