నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తేరటుపల్లి హనుమంత్ మాతృమూర్తి అనసూయ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా వారి దశదిన కర్మకు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి