చిట్యాల మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాo ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాo ఎమ్మెల్యే వేముల వీరేశం
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిలువేరు శేఖర్, 11వ వార్డు అభ్యర్థి బొబ్బలి సందీప – రాంరెడ్డి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే గుణం శేఖర్లో ఉందని తెలిపారు. 10వ, 11వ వార్డుల్లో డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ వార్డుకు 70 ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని, అలాగే మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
గత ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయకుండా విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. తాను 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 250 ఇండ్ల నిర్మాణాలు చేపట్టామని గుర్తు చేశారు.చిట్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని, అలాగే మహిళా సంఘాలకు రైస్ మిల్లును కేటాయిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి