స్థానికం ప్రతినిధికొమిడాల మహేందర్ రెడ్డి.
చిట్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. మొదటి రోజే రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. మొత్తం 12 వార్డులు ఉన్న చిట్యాల మున్సిపాలిటీలో తొలి రోజున 9 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు.
దాఖలైన నామినేషన్లలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. అవి 1, 5, 6, 7, 9, 10 మరియు 12 వార్డులకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు.ఇక రెండో వార్డుకు సీపీఐ పార్టీ తరఫున ఒక నామినేషన్, ఆరవ వార్డుకు బీజేపీ పార్టీ తరఫున మరో నామినేషన్ దాఖలైనట్లు కమిషనర్ వివరించారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవడంతో చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ సందడి నెలకొంది. రాబోయే రోజుల్లో మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి