Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:36 PM

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్త తరంగం సీనియర్ నేతలకు షాక్

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్త తరంగం సీనియర్ నేతలకు షాక్

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్త తరంగం సీనియర్ నేతలకు షాక్
February 13, 2026 06:24 PM 642 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ముఖాల దుమ్మురేపు

సీనియర్ నాయకులకు షాక్ – వార్డు అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు

చిట్యాల మున్సిపల్ ఎన్నికలు ఈసారి రాజకీయ వాతావరణాన్ని ఊహించని మలుపుతిప్పాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో పట్టు సాధించిన సీనియర్ నాయకులపై నూతనంగా రాజకీయ రంగప్రవేశం చేసిన అభ్యర్థులు ఘనవిజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. యువత, మహిళలు, కొత్త ఆలోచనలకు ప్రజలు మద్దతు పలికారన్న సంకేతాలు ఈ ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ముఖ్యంగా ఒకటవ వార్డు నుంచి ట్రాన్స్లేటర్‌గా పరిచయం ఉన్న నాగిల్ల సుధాకర్ అలియాస్ కావేరి విజయం సాధించడం విశేషం. రెండో వార్డు నుంచి షేక్ షబానా అజీమ్ కౌన్సిలర్‌గా ఎన్నికై మహిళా ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేశారు. ఏడవ వార్డులో దేశపాక లతా రాజేష్, ఎనిమిదవ వార్డులో జేరిపోతుల సత్యనారాయణ, పదో వార్డులో నిమ్మనగోటి శ్రీనివాస్ గెలుపొందడం ద్వారా కొత్త తరానికి చిట్యాల ప్రజలు అవకాశం ఇచ్చారు.ప్రచార సమయంలో వీరు స్థానిక సమస్యలపై దృష్టి సారించి, పారదర్శక పరిపాలన, మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు–డ్రైనేజీ సమస్యల పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటుపై హామీలు ఇచ్చారు. సీనియర్ నాయకుల అనుభవానికి పోటీగా కొత్త ఆలోచనలు, ప్రజలతో నేరుగా మమేకమవడం వీరి విజయానికి దోహదపడిన అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఫలితాలతో చిట్యాల రాజకీయాల్లో కొత్త వరవడి ప్రారంభమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎన్నికల హామీలను అమలు చేసి వార్డు అభివృద్ధిని వేగవంతం చేయగలరా అన్నది వేచి చూడాల్సిందే. ప్రజల ఆశలు, అంచనాలు భారీగా ఉన్న ఈ నేపథ్యంలో నూతన కౌన్సిలర్లు తమ పనితీరుతో విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News