Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:42 AM

చిట్యాల గ్రోమోర్ సెంటర్‌పై వ్యవసాయ శాఖ చర్యలు

చిట్యాల గ్రోమోర్ సెంటర్‌పై వ్యవసాయ శాఖ చర్యలు

చిట్యాల గ్రోమోర్ సెంటర్‌పై వ్యవసాయ శాఖ చర్యలు
20-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని గ్రోమోర్ సెంటర్‌లో రైతులకు డీఏపీ, కాంప్లెక్స్ వంటి రసాయన ఎరువులతో పాటు ఆర్గానిక్ ఎరువులను బలవంతంగా లింకు పెట్టి విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా FCO 1985 క్లాజ్ 28 ప్రకారం గ్రోమోర్ సెంటర్‌పై చర్యలు తీసుకున్నట్లు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి బాబు తెలిపారు.

దీని ప్రకారం భూ ఔషధ్ మరియు ఎఫ్-20 ఆర్గానిక్ ఎరువుల అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం గ్రోమోర్ సెంటర్‌లో నిల్వ ఉన్న భూ ఔషధ్, ఎఫ్-20 ఆర్గానిక్ ఎరువులను పూర్తిగా సీజ్ చేసినట్లు వెల్లడించారు.రైతులు ఇకపై ఎలాంటి ఆర్గానిక్ ఎరువుల లింకు లేకుండా రసాయనిక ఎరువులను స్వేచ్ఛగా కొనుగోలు చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి సూచించారు.

Sthanikam

చిట్యాల గ్రోమోర్ సెంటర్‌పై వ్యవసాయ శాఖ చర్యలు

Article Image

చిట్యాల మండలంలోని గ్రోమోర్ సెంటర్‌లో రైతులకు డీఏపీ, కాంప్లెక్స్ వంటి రసాయన ఎరువులతో పాటు ఆర్గానిక్ ఎరువులను బలవంతంగా లింకు పెట్టి విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా FCO 1985 క్లాజ్ 28 ప్రకారం గ్రోమోర్ సెంటర్‌పై చర్యలు తీసుకున్నట్లు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి బాబు తెలిపారు.

దీని ప్రకారం భూ ఔషధ్ మరియు ఎఫ్-20 ఆర్గానిక్ ఎరువుల అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం గ్రోమోర్ సెంటర్‌లో నిల్వ ఉన్న భూ ఔషధ్, ఎఫ్-20 ఆర్గానిక్ ఎరువులను పూర్తిగా సీజ్ చేసినట్లు వెల్లడించారు.రైతులు ఇకపై ఎలాంటి ఆర్గానిక్ ఎరువుల లింకు లేకుండా రసాయనిక ఎరువులను స్వేచ్ఛగా కొనుగోలు చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News