PRINT TIME: May 26, 2026 03:05 PM
చిట్యాల గ్రోమోర్ సెంటర్పై వ్యవసాయ శాఖ చర్యలు
చిట్యాల గ్రోమోర్ సెంటర్పై వ్యవసాయ శాఖ చర్యలు
May 20, 2026 06:26 PM
16 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మండలంలోని గ్రోమోర్ సెంటర్లో రైతులకు డీఏపీ, కాంప్లెక్స్ వంటి రసాయన ఎరువులతో పాటు ఆర్గానిక్ ఎరువులను బలవంతంగా లింకు పెట్టి విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా FCO 1985 క్లాజ్ 28 ప్రకారం గ్రోమోర్ సెంటర్పై చర్యలు తీసుకున్నట్లు మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి బాబు తెలిపారు.
దీని ప్రకారం భూ ఔషధ్ మరియు ఎఫ్-20 ఆర్గానిక్ ఎరువుల అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం గ్రోమోర్ సెంటర్లో నిల్వ ఉన్న భూ ఔషధ్, ఎఫ్-20 ఆర్గానిక్ ఎరువులను పూర్తిగా సీజ్ చేసినట్లు వెల్లడించారు.రైతులు ఇకపై ఎలాంటి ఆర్గానిక్ ఎరువుల లింకు లేకుండా రసాయనిక ఎరువులను స్వేచ్ఛగా కొనుగోలు చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి