చిట్ఫండ్ మోసం బట్టబయలు.. అక్షర సంస్థ అధిపతి అరెస్ట్
చిట్ఫండ్ మోసం బట్టబయలు.. అక్షర సంస్థ అధిపతి అరెస్ట్
Biksham Goud
ఆదిలాబాద్:
చిట్టీల పేరిట డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడిన అక్షర చిట్ఫండ్ సంస్థ అధిపతి పేరాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా పోలీసు అధికారి అఖిల్ మహాజన్ తెలిపారు.
హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో చిట్ఫండ్ వ్యాపారం ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల చిట్టీ పథకాలు నిర్వహించారు. వందలాది మందినుంచి భారీగా డిపాజిట్లు సేకరించి గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు డబ్బులు తిరిగి చెల్లించకుండా మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు.
ఆదిలాబాద్ పట్టణంలోనే పన్నెండు కేసులు నమోదు కాగా బాధితులకు కోటి పదకొండు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్లలో మొత్తం తొంభై ఆరు కేసులు నమోదయ్యాయని చెప్పారు. గత ఆరు నెలలుగా పరారీలో ఉన్న నిందితుడిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి ఆదిలాబాద్లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
నిందితుడికి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని, ఇప్పటికే కొన్ని ఆస్తులను జప్తు చేయగా మిగిలిన వాటిని కూడా చట్టపరంగా జప్తు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి