Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:32 AM

చినిగేపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం

చినిగేపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం

చినిగేపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం
07-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్‌కల్ మండలంలోని చినిగేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో ఈ పనులను చేపట్టారు.పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ పనులకు శుక్రవారం స్థానిక సర్పంచ్ సుధాకర్,ఉప సర్పంచ్,పాఠశాల అధ్యక్షురాలు నర్సమ్మ,మండల పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి మహేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రుబీనా,గ్రామ పంచాయతీ కార్యదర్శి మమ్మద్ గౌస్ తదితరులు శుభారంభం చేశారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ రెడ్డి,న్యాల్‌కల్ సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,శంకర్ రెడ్డి,హాజీ పాటిల్,వెంకన్న,శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.ప్రారంభోత్సవానికి హాజరైన ప్రత్యేక అతిథులను స్థానిక సర్పంచ్ ఘనంగా సత్కరించారు.

Sthanikam

చినిగేపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం

Article Image

న్యాల్‌కల్ మండలంలోని చినిగేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో ఈ పనులను చేపట్టారు.పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ పనులకు శుక్రవారం స్థానిక సర్పంచ్ సుధాకర్,ఉప సర్పంచ్,పాఠశాల అధ్యక్షురాలు నర్సమ్మ,మండల పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి మహేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రుబీనా,గ్రామ పంచాయతీ కార్యదర్శి మమ్మద్ గౌస్ తదితరులు శుభారంభం చేశారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ రెడ్డి,న్యాల్‌కల్ సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,శంకర్ రెడ్డి,హాజీ పాటిల్,వెంకన్న,శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.ప్రారంభోత్సవానికి హాజరైన ప్రత్యేక అతిథులను స్థానిక సర్పంచ్ ఘనంగా సత్కరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News