చినిగేపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం
చినిగేపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్ మండలంలోని చినిగేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల్లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో ఈ పనులను చేపట్టారు.పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ పనులకు శుక్రవారం స్థానిక సర్పంచ్ సుధాకర్,ఉప సర్పంచ్,పాఠశాల అధ్యక్షురాలు నర్సమ్మ,మండల పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి మహేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రుబీనా,గ్రామ పంచాయతీ కార్యదర్శి మమ్మద్ గౌస్ తదితరులు శుభారంభం చేశారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక
ఆహ్వానితులుగా జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ రెడ్డి,న్యాల్కల్ సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,శంకర్ రెడ్డి,హాజీ పాటిల్,వెంకన్న,శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.ప్రారంభోత్సవానికి హాజరైన ప్రత్యేక అతిథులను స్థానిక సర్పంచ్ ఘనంగా సత్కరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి