చిన్నారితో ముచ్చటించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్....
అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం కోదాడకు వచ్చిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సామాన్య ప్రజలతో కలిసిపోయారు. రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్తుండగా, దారిలో తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని చూసి చిరునవ్వుతో పలకరించారు. పాప పేరు అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఆమెను అంగన్వాడీకి పంపిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. కలెక్టర్ స్వయంగా ఆగి తమను పలకరించడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. అధికారులంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవారే కాదు, ప్రజల బాగోగులు చూసేవారని ఆయన మరోసారి నిరూపించారు.....
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి