Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:54 AM

చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు

చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు  గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు
February 10, 2026 08:06 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు ఈస్ట్ డి.సి.పి.కృష్ణ కాంత్ పటేల్ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను ఆధారంగా చేసుకుని అత్యంత పటిష్టంగా బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగింది.

ఉత్సవాల సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో, జన సమూహ నియంత్రణలో అని ముఖ్య ప్రదేశాలలో సీసీ కెమెరాల ద్వారా నిఘా, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక ఏర్పాట్లతో పాటు అన్నీ శాఖల సమన్వయంతో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పెద్ద కార్యక్రమాలలో భక్తుల రద్దీ నేపథ్యంలో చిన్నపిల్లలు తప్పిపోవడం వారిని వెతుకుంటూ వారి కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులను తొలగించడానికి గత సంవత్సరం జిల్లా యంత్రాంగం వారు చిన్న పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను పిల్లలకు వేయించడం జరిగింది. ఈ నేపధ్యంలో ఈ రోజు గుణదల మేరీమాత టెంపుల్ పరిసర ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం ఐ.సి.డి.ఎస్., రెవెన్యూ, ఫోరం ఫర్ చైల్డ్ టీం వారు పలు బృందాలుగా ఏర్పడి తిరునాళ్ళకు వచ్చిన చిన్న పిల్లలకు వారి వివరాలను పొందుపరిచిన చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఏ.సి.పి. కె.దామోధర్ , మాచవరం ఇన్స్పెక్టర్ డి.వి.రమణ , ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ ఇతర అదికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News