చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు
చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన చైల్డ్ మానిటరింగ్ టాగ్ ల ఏర్పాటు గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు
GADDAM JAGANMOHAN REDDY
విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలను పురస్కరించుకొని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు ఈస్ట్ డి.సి.పి.కృష్ణ కాంత్ పటేల్ పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను ఆధారంగా చేసుకుని అత్యంత పటిష్టంగా బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగింది.
ఉత్సవాల సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణలో, జన సమూహ నియంత్రణలో అని ముఖ్య ప్రదేశాలలో సీసీ కెమెరాల ద్వారా నిఘా, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక ఏర్పాట్లతో పాటు అన్నీ శాఖల సమన్వయంతో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పెద్ద కార్యక్రమాలలో భక్తుల రద్దీ నేపథ్యంలో చిన్నపిల్లలు తప్పిపోవడం వారిని వెతుకుంటూ వారి కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులను తొలగించడానికి గత సంవత్సరం జిల్లా యంత్రాంగం వారు చిన్న పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను పిల్లలకు వేయించడం జరిగింది. ఈ నేపధ్యంలో ఈ రోజు గుణదల మేరీమాత టెంపుల్ పరిసర ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం ఐ.సి.డి.ఎస్., రెవెన్యూ, ఫోరం ఫర్ చైల్డ్ టీం వారు పలు బృందాలుగా ఏర్పడి తిరునాళ్ళకు వచ్చిన చిన్న పిల్లలకు వారి వివరాలను పొందుపరిచిన చైల్డ్ ట్రాకింగ్ టాగ్ లను వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఏ.సి.పి. కె.దామోధర్ , మాచవరం ఇన్స్పెక్టర్ డి.వి.రమణ , ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ ఇతర అదికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి