Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:59 AM

చెరువులు నింపి పంటలు కాపాడాలి... సిపిఐ

చెరువులు నింపి పంటలు కాపాడాలి... సిపిఐ

చెరువులు నింపి పంటలు కాపాడాలి... సిపిఐ
22-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజాపేట: సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయని ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం మండలంలోని బొందుగుల గ్రామంలో ఎండిన పొలాలను పరిశీలించారు. చిగుళ్ల లింగం మాట్లాడుతూ రాజపేట మండలంలో సింగారం రెడ్డి చెరువు ను నింపి అన్ని గ్రామాల కాలువల ద్వారా చెరువులు నింపి పంట పొలాలను ఎండిపోయిన రైతులను కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొందుగుల గ్రామంలో మర్ల నాగరాజ్ అనే కవులు రైతు కాలే లక్ష్మి దగ్గర నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి పొలం పెట్టాడని,పంట చేతికి వచ్చే సమయానికి బోరు బావి పూర్తిగా ఎండిపోయి నీళ్లు ఎండిపోతున్న పొలాన్ని చూసి కౌలు రైతు నాగరాజు లబోదిబోమంటున్నాడు అన్నారు.ఏమి తోచక పంటను కాపాడడానికి ట్రాక్టర్ ట్యాంకర్ తో నీళ్లను తెచ్చి పొలాన్ని పది రోజుల నుండి కాపాడుకుంటున్నాడన్నారు . ఇప్పటికీ నాలుగు ఎకరాల పెట్టుబడికి లక్ష రూపాయలు అప్పు చేయగా ఇప్పుడు వరిసేను కాపాడుకోడానికి ట్యాంకరుకు రోజుకు 1500 రూపాయలు ఖర్చు చేస్తున్నాడని,ఇంకా నెల రోజులు పొలం పారాలి ఇప్పుడు ఆ రైతు నెత్తికి చేతులు పెట్టి ఏమి చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి రైతులు ఎంతోమంది ట్యాంకర్ల ద్వారా పంట పొలాలను కాపాడుకుంటున్నారు ప్రభుత్వం స్పందించి చెరువుల నింపి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీర్ల ఐలయ్య ఇచ్చిన చెరువులు నింపుతానని హామీ నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. 8 కిలోమీటర్లు సొంత నిధుల తో కాల్వ తవ్వించి రాజపేట మండలంలో చెరువులు నింపుతామని చెప్పి రెండేళ్లు దాటినా పట్టింపు లేకుండా వ్యవహరించడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి మూలపోచయ్య, బొందుగుల నేతలు గొల్లూరు రాములు, గ్రామ శాఖ కార్యదర్శి రైతులు పాల్గొన్నా

Sthanikam

చెరువులు నింపి పంటలు కాపాడాలి... సిపిఐ

Article Image

రాజాపేట: సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయని ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం మండలంలోని బొందుగుల గ్రామంలో ఎండిన పొలాలను పరిశీలించారు. చిగుళ్ల లింగం మాట్లాడుతూ రాజపేట మండలంలో సింగారం రెడ్డి చెరువు ను నింపి అన్ని గ్రామాల కాలువల ద్వారా చెరువులు నింపి పంట పొలాలను ఎండిపోయిన రైతులను కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొందుగుల గ్రామంలో మర్ల నాగరాజ్ అనే కవులు రైతు కాలే లక్ష్మి దగ్గర నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి పొలం పెట్టాడని,పంట చేతికి వచ్చే సమయానికి బోరు బావి పూర్తిగా ఎండిపోయి నీళ్లు ఎండిపోతున్న పొలాన్ని చూసి కౌలు రైతు నాగరాజు లబోదిబోమంటున్నాడు అన్నారు.ఏమి తోచక పంటను కాపాడడానికి ట్రాక్టర్ ట్యాంకర్ తో నీళ్లను తెచ్చి పొలాన్ని పది రోజుల నుండి కాపాడుకుంటున్నాడన్నారు . ఇప్పటికీ నాలుగు ఎకరాల పెట్టుబడికి లక్ష రూపాయలు అప్పు చేయగా ఇప్పుడు వరిసేను కాపాడుకోడానికి ట్యాంకరుకు రోజుకు 1500 రూపాయలు ఖర్చు చేస్తున్నాడని,ఇంకా నెల రోజులు పొలం పారాలి ఇప్పుడు ఆ రైతు నెత్తికి చేతులు పెట్టి ఏమి చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి రైతులు ఎంతోమంది ట్యాంకర్ల ద్వారా పంట పొలాలను కాపాడుకుంటున్నారు ప్రభుత్వం స్పందించి చెరువుల నింపి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బీర్ల ఐలయ్య ఇచ్చిన చెరువులు నింపుతానని హామీ నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. 8 కిలోమీటర్లు సొంత నిధుల తో కాల్వ తవ్వించి రాజపేట మండలంలో చెరువులు నింపుతామని చెప్పి రెండేళ్లు దాటినా పట్టింపు లేకుండా వ్యవహరించడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి మూలపోచయ్య, బొందుగుల నేతలు గొల్లూరు రాములు, గ్రామ శాఖ కార్యదర్శి రైతులు పాల్గొన్నా

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News