Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:55 PM

చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి కూలీ మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి కూలీ మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి కూలీ మృతి
03-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం జిరపల్లి గ్రామానికి చెందిన పిచ్చగుంట్ల సంగప్ప (52) అనే కూలీ చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టే సమయంలో వల కాలికి చిక్కుకోవడంతో నీటిలో నుంచి బయటపడలేక ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మృతుడి కుమారుడు పిచ్చగుంట్ల పాపయ్య ఝరాసంగం పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో జిరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి కూలీ మృతి

Article Image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం జిరపల్లి గ్రామానికి చెందిన పిచ్చగుంట్ల సంగప్ప (52) అనే కూలీ చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టే సమయంలో వల కాలికి చిక్కుకోవడంతో నీటిలో నుంచి బయటపడలేక ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మృతుడి కుమారుడు పిచ్చగుంట్ల పాపయ్య ఝరాసంగం పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో జిరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News