Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:50 PM

చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి కూలీ మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి కూలీ మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి కూలీ మృతి
May 03, 2026 08:54 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం జిరపల్లి గ్రామానికి చెందిన పిచ్చగుంట్ల సంగప్ప (52) అనే కూలీ చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టే సమయంలో వల కాలికి చిక్కుకోవడంతో నీటిలో నుంచి బయటపడలేక ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మృతుడి కుమారుడు పిచ్చగుంట్ల పాపయ్య ఝరాసంగం పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో జిరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News