PRINT TIME: May 03, 2026 10:10 PM
చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి కూలీ మృతి
చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి కూలీ మృతి
May 03, 2026 08:54 PM
16 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం జిరపల్లి గ్రామానికి చెందిన పిచ్చగుంట్ల సంగప్ప (52) అనే కూలీ చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టే సమయంలో వల కాలికి చిక్కుకోవడంతో నీటిలో నుంచి బయటపడలేక ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మృతుడి కుమారుడు పిచ్చగుంట్ల పాపయ్య ఝరాసంగం పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో జిరపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి