చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు
చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడికల్ అండ్ హెల్త్, చేనేత శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. శిబిరాల్లో చేనేత కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలతో పాటు వివిధ వ్యాధులపై నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.
జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్ నిపుణులు, నేత్ర వైద్యులు పాల్గొని కార్మికులకు ప్రత్యేక చికిత్సలు అందిస్తారని పేర్కొన్నారు. అన్ని మండలాల్లో దశల వారీగా ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అవసరమైన వారికి ఉచితంగా మందులు, చికిత్సలు అందించడంతో పాటు, తీవ్రమైన కేసులను రిఫరల్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా ఉంటాయని తెలిపారు. చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి