Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:20 PM

చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు

చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు

చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు
March 24, 2026 08:27 PM 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడికల్ అండ్ హెల్త్, చేనేత శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. శిబిరాల్లో చేనేత కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలతో పాటు వివిధ వ్యాధులపై నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.

జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్ నిపుణులు, నేత్ర వైద్యులు పాల్గొని కార్మికులకు ప్రత్యేక చికిత్సలు అందిస్తారని పేర్కొన్నారు. అన్ని మండలాల్లో దశల వారీగా ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అవసరమైన వారికి ఉచితంగా మందులు, చికిత్సలు అందించడంతో పాటు, తీవ్రమైన కేసులను రిఫరల్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా ఉంటాయని తెలిపారు. చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News