Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:02 AM

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే క్రీడలు మార్గం డి.ఎస్.పి శివరాం రెడ్డి

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే క్రీడలు మార్గం డి.ఎస్.పి శివరాం రెడ్డి

 చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే క్రీడలు మార్గం డి.ఎస్.పి శివరాం రెడ్డి
January 15, 2026 09:12 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

క్రీడల వల్ల యువతలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతుందని నలగొండ జిల్లా డిఎస్పి శివరాం రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ల ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడి అక్కడ ఉన్న పలువురిని ఆకర్షించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి కలిగిస్తాయని, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకొని ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు అంతేకాకుండా క్రీడలతో యువత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చు అని తెలియజేశారు నేటి సమాజంలో యువత ఎక్కువగా గంజాయి డ్రగ్స్ ఆన్లైన్ బెట్టింగ్ వంటి దురాలవాట్లకు లోనై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వాటికి దూరంగా ఉండాలని అన్నారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల నాయకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, నార్కెట్పల్లి సీఐ నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లo మహేష్, వార్డు మెంబర్ నాతి కిరణ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు పంది నరేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అరూరి ప్రణీత్, నెలికంటి నరసింహ, నాతి వెంకటరామయ్య, దేశబోయిన లింగస్వామి, సురకంటి మోహన్ రెడ్డి, దేశబోయిన నరసింహ, బొంతల సాయి ప్రసాద్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, గోలి సాయికిరణ్, కునూరు గణేష్, శ్రీకాంత్, అరూరి పవన్, ఆరూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News