చౌటుప్పల్లో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం రెండు గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
చౌటుప్పల్లో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం రెండు గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
K.RAVI
యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకోగా, పోలీసులు వేగంగా స్పందించి రెండు గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం, తేదీ 02.04.2026 ఉదయం 08.30 గంటల సమయంలో మల్కాపురం గ్రామానికి చెందిన సిద్దగొని నర్సమ్మ (48) తన అక్క అళివేలు తో కలిసి ధర్మకొల్ కంపెనీకి వెళ్తుండగా మార్గమధ్యంలోని దర్గాహ్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు వారి వెంట వచ్చి, ఆమె మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ చైన్ను బంగారం చైన్గా భావించి బలవంతంగా లాక్కొని పారిపోయారు.ఈ ఘటనపై బాధితులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు Cr.No. 164/2026, U/s 309(4) BNS కింద కేసు నమోదు చేశారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాలు, డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు, ఇన్స్పెక్టర్ మన్మధకుమార్, ఎస్ఐ కనకటి యాదగిరి, పోలీసు సిబ్బంది వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రెండు గంటల్లోనే మల్కాపురం గ్రామంలోని ఆందోల్ మైసమ్మ గుడి సమీపంలో నిందితులను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన నిందితులు ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్ సయీద్ (25), బోడ చరణ్ (18)గా గుర్తించారు.
వారి వద్ద నుండి రోల్డ్ గోల్డ్ చైన్ (రూ.1,000 విలువ), ఒక నోకియా కీప్యాడ్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు చేసిన నిందితులను 03.04.2026న కోర్టులో హాజరు పరచి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి