Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:57 PM

చౌటుప్పల్‌లో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం రెండు గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

చౌటుప్పల్‌లో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం రెండు గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు

చౌటుప్పల్‌లో చైన్ స్నాచింగ్ యత్నం విఫలం రెండు గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసులు
April 03, 2026 06:42 PM 360 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకోగా, పోలీసులు వేగంగా స్పందించి రెండు గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం, తేదీ 02.04.2026 ఉదయం 08.30 గంటల సమయంలో మల్కాపురం గ్రామానికి చెందిన సిద్దగొని నర్సమ్మ (48) తన అక్క అళివేలు తో కలిసి ధర్మకొల్ కంపెనీకి వెళ్తుండగా మార్గమధ్యంలోని దర్గాహ్ సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు వారి వెంట వచ్చి, ఆమె మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ చైన్‌ను బంగారం చైన్‌గా భావించి బలవంతంగా లాక్కొని పారిపోయారు.ఈ ఘటనపై బాధితులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు Cr.No. 164/2026, U/s 309(4) BNS కింద కేసు నమోదు చేశారు.

యాదాద్రి-భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాలు, డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు, ఇన్స్పెక్టర్ మన్మధకుమార్, ఎస్‌ఐ కనకటి యాదగిరి, పోలీసు సిబ్బంది వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రెండు గంటల్లోనే మల్కాపురం గ్రామంలోని ఆందోల్ మైసమ్మ గుడి సమీపంలో నిందితులను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన నిందితులు ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహ్మద్ సయీద్ (25), బోడ చరణ్ (18)గా గుర్తించారు.

వారి వద్ద నుండి రోల్డ్ గోల్డ్ చైన్ (రూ.1,000 విలువ), ఒక నోకియా కీప్యాడ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు చేసిన నిందితులను 03.04.2026న కోర్టులో హాజరు పరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News