Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బక్రీద్ వేళ మానవత్వాన్ని చాటిన:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:29 PM

చౌటుప్పల్‌లో బీసీ వసతి గృహాన్ని పునఃప్రారంభించాలి

చౌటుప్పల్‌లో బీసీ వసతి గృహాన్ని పునఃప్రారంభించాలి

చౌటుప్పల్‌లో బీసీ వసతి గృహాన్ని పునఃప్రారంభించాలి
May 27, 2026 05:19 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అధికారులు మొండి నిద్ర వీడాలి

వసతి లేక పేద విద్యార్థులు చదువుకు దూరం

ఇన్‌ఛార్జ్ ఆర్డీఓకు ఎస్ఎఫ్‌ఐ వినతిపత్రం

నిర్లక్ష్యం వీడకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం

చౌటుప్పల్ కేంద్రంలో గతంలో ఉండి, ప్రస్తుతం మూతపడిన బీసీ విద్యార్థుల వసతి గృహాన్ని (హాస్టల్) తక్షణమే పునఃప్రారంభించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఎస్ఎఫ్‌ఐ చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇన్‌ఛార్జ్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలో గతంలో ఉన్న బీసీ హాస్టల్‌ను మూసివేయడం వల్ల వందలాది మంది పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా.. హాస్టల్ పునరుద్ధరణపై అధికారులు కనీస శ్రద్ధ చూపకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. అధికారులు తమ మొండి నిద్రను వీడి తక్షణమే వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.​

హాస్టల్ లేక బాల కార్మికులుగా మారుతున్న వైనం..

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బడుగు, బలహీన వర్గాల పేద విద్యార్థులకు చౌటుప్పల్‌లో వసతి సౌకర్యం లేకపోవడంతో చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు, పేద విద్యార్థులు హాస్టల్ లేకపోవడం వల్ల చదువు మానేసి బాల కార్మికులుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌లో బీసీ హాస్టల్ ఏర్పాటు చేస్తే ఇలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకు ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు.

​అధికారుల నిర్లక్ష్య వైఖరిని వీడకుండా చౌటుప్పల్‌లో బీసీ హాస్టల్‌ను పునఃప్రారంభించకపోతే, విద్యార్థులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్‌ఐ నేతలు హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్‌ఐ మండల నాయకులు శీను, శివ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News