Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 10:02 AM

చాట్రాయిలో పదో తరగతి వందరోజుల ప్రణాళికపై ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలన

చాట్రాయిలో పదో తరగతి వందరోజుల ప్రణాళికపై ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలన

చాట్రాయిలో పదో తరగతి వందరోజుల ప్రణాళికపై ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలన
February 27, 2026 05:36 PM 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సి.గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళికను మండల విద్యాశాఖ అధికారి–1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, జీవితంలో పదో తరగతి ఉత్తీర్ణత ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. పరీక్షలను భయంతో కాకుండా ఆసక్తితో రాయాలని, ఆందోళనతో చదివితే ఫలితం ఉండదని సూచించారు. విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు వందరోజుల ప్రణాళికను క్రమంగా అనుసరించి సిద్ధమైతే 100 శాతం ఉత్తీర్ణత సాధించడం కష్టం కాదని తెలిపారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.

అనంతరం తెలుగు విషయానికి సంబంధించిన సందేహాలను విద్యార్థుల నుంచి స్వీకరించి, స్వయంగా వ్యాకరణ అంశాలు మరియు రామాయణానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అవగాహన కల్పించారు.

తదుపరి మర్రిబంధం ప్రాథమిక పాఠశాలను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) అమలు విధానాన్ని పరిశీలించారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగడి బక్కయ్య, సీత జ్యోతి, సహోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News