Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 27, 2026 07:01 PM

చాట్రాయిలో పదో తరగతి వందరోజుల ప్రణాళికపై ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలన

చాట్రాయిలో పదో తరగతి వందరోజుల ప్రణాళికపై ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలన

చాట్రాయిలో పదో తరగతి వందరోజుల ప్రణాళికపై ఎంఈఓ1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలన
February 27, 2026 05:36 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సి.గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళికను మండల విద్యాశాఖ అధికారి–1 మాసగిరి శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, జీవితంలో పదో తరగతి ఉత్తీర్ణత ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. పరీక్షలను భయంతో కాకుండా ఆసక్తితో రాయాలని, ఆందోళనతో చదివితే ఫలితం ఉండదని సూచించారు. విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు వందరోజుల ప్రణాళికను క్రమంగా అనుసరించి సిద్ధమైతే 100 శాతం ఉత్తీర్ణత సాధించడం కష్టం కాదని తెలిపారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.

అనంతరం తెలుగు విషయానికి సంబంధించిన సందేహాలను విద్యార్థుల నుంచి స్వీకరించి, స్వయంగా వ్యాకరణ అంశాలు మరియు రామాయణానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అవగాహన కల్పించారు.

తదుపరి మర్రిబంధం ప్రాథమిక పాఠశాలను సందర్శించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) అమలు విధానాన్ని పరిశీలించారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంగడి బక్కయ్య, సీత జ్యోతి, సహోపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News