Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:59 PM

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో  50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే
February 24, 2026 04:44 PM 250 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం, నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రబీ సీజన్‌లో మండల వ్యాప్తంగా సుమారు 11,450 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినట్లు తెలిపారు.

గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో ముఖ్యంగా నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో పంట నేలకొరిగినట్లు వెల్లడించారు. పడిపోయిన పంటను నిలబెట్టేందుకు రైతులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

పొలాల్లో అధికంగా నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కర్రలకు తేమ ఎక్కువసేపు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరో 10 నుండి 20 రోజుల్లో కండెలు పూర్తిగా ఎండే దశలో ఉన్నందున రైతులు కోతలకు సిద్ధంగా ఉండి పంటను కాపాడుకోవాలని సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే కొద్దీ యూరియా అధికంగా వాడిన పొలాల్లో లేదా నేలలోని శిలీంద్రాల ప్రభావంతో ఆకు, కాండం ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందన్నారు. అజోక్సిస్ట్రోబిన్ 11 శాతం, టెబుకొనాజోల్ 18.3 శాతం మిశ్రమ మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేస్తే తెగుళ్లను సమర్థంగా నియంత్రించవచ్చని వ్యవసాయాధికారి తెలిపారు.

రైతులు అప్రమత్తంగా ఉండి పంటను రక్షించుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News