Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:27 AM

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో  50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే
February 24, 2026 04:44 PM 256 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం, నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రబీ సీజన్‌లో మండల వ్యాప్తంగా సుమారు 11,450 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినట్లు తెలిపారు.

గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో ముఖ్యంగా నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో పంట నేలకొరిగినట్లు వెల్లడించారు. పడిపోయిన పంటను నిలబెట్టేందుకు రైతులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

పొలాల్లో అధికంగా నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కర్రలకు తేమ ఎక్కువసేపు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరో 10 నుండి 20 రోజుల్లో కండెలు పూర్తిగా ఎండే దశలో ఉన్నందున రైతులు కోతలకు సిద్ధంగా ఉండి పంటను కాపాడుకోవాలని సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే కొద్దీ యూరియా అధికంగా వాడిన పొలాల్లో లేదా నేలలోని శిలీంద్రాల ప్రభావంతో ఆకు, కాండం ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందన్నారు. అజోక్సిస్ట్రోబిన్ 11 శాతం, టెబుకొనాజోల్ 18.3 శాతం మిశ్రమ మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేస్తే తెగుళ్లను సమర్థంగా నియంత్రించవచ్చని వ్యవసాయాధికారి తెలిపారు.

రైతులు అప్రమత్తంగా ఉండి పంటను రక్షించుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News