Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:02 PM

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో  50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే
February 24, 2026 04:44 PM 252 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం, నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రబీ సీజన్‌లో మండల వ్యాప్తంగా సుమారు 11,450 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినట్లు తెలిపారు.

గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో ముఖ్యంగా నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో పంట నేలకొరిగినట్లు వెల్లడించారు. పడిపోయిన పంటను నిలబెట్టేందుకు రైతులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

పొలాల్లో అధికంగా నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కర్రలకు తేమ ఎక్కువసేపు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరో 10 నుండి 20 రోజుల్లో కండెలు పూర్తిగా ఎండే దశలో ఉన్నందున రైతులు కోతలకు సిద్ధంగా ఉండి పంటను కాపాడుకోవాలని సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే కొద్దీ యూరియా అధికంగా వాడిన పొలాల్లో లేదా నేలలోని శిలీంద్రాల ప్రభావంతో ఆకు, కాండం ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందన్నారు. అజోక్సిస్ట్రోబిన్ 11 శాతం, టెబుకొనాజోల్ 18.3 శాతం మిశ్రమ మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేస్తే తెగుళ్లను సమర్థంగా నియంత్రించవచ్చని వ్యవసాయాధికారి తెలిపారు.

రైతులు అప్రమత్తంగా ఉండి పంటను రక్షించుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News