Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:27 PM

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో  50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే
24-02-2026 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం, నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రబీ సీజన్‌లో మండల వ్యాప్తంగా సుమారు 11,450 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినట్లు తెలిపారు.

గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో ముఖ్యంగా నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో పంట నేలకొరిగినట్లు వెల్లడించారు. పడిపోయిన పంటను నిలబెట్టేందుకు రైతులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

పొలాల్లో అధికంగా నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కర్రలకు తేమ ఎక్కువసేపు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరో 10 నుండి 20 రోజుల్లో కండెలు పూర్తిగా ఎండే దశలో ఉన్నందున రైతులు కోతలకు సిద్ధంగా ఉండి పంటను కాపాడుకోవాలని సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే కొద్దీ యూరియా అధికంగా వాడిన పొలాల్లో లేదా నేలలోని శిలీంద్రాల ప్రభావంతో ఆకు, కాండం ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందన్నారు. అజోక్సిస్ట్రోబిన్ 11 శాతం, టెబుకొనాజోల్ 18.3 శాతం మిశ్రమ మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేస్తే తెగుళ్లను సమర్థంగా నియంత్రించవచ్చని వ్యవసాయాధికారి తెలిపారు.

రైతులు అప్రమత్తంగా ఉండి పంటను రక్షించుకోవాలని ఆయన కోరారు.

Sthanikam

చాట్రాయి మండలంలో అకాల వర్షం దెబ్బ: నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలకొరుగే

Article Image

చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం, నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో మొక్కజొన్న పంటను వ్యవసాయాధికారి బి. శివశంకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రబీ సీజన్‌లో మండల వ్యాప్తంగా సుమారు 11,450 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినట్లు తెలిపారు.

గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో ముఖ్యంగా నరసింహారావుపాలెం, చనుబండ గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో పంట నేలకొరిగినట్లు వెల్లడించారు. పడిపోయిన పంటను నిలబెట్టేందుకు రైతులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

పొలాల్లో అధికంగా నిల్వైన నీటిని కాలువల ద్వారా బయటకు పంపించి, మొక్కజొన్న కర్రలకు తేమ ఎక్కువసేపు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరో 10 నుండి 20 రోజుల్లో కండెలు పూర్తిగా ఎండే దశలో ఉన్నందున రైతులు కోతలకు సిద్ధంగా ఉండి పంటను కాపాడుకోవాలని సూచించారు.

ఎండ తీవ్రత పెరిగే కొద్దీ యూరియా అధికంగా వాడిన పొలాల్లో లేదా నేలలోని శిలీంద్రాల ప్రభావంతో ఆకు, కాండం ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందన్నారు. అజోక్సిస్ట్రోబిన్ 11 శాతం, టెబుకొనాజోల్ 18.3 శాతం మిశ్రమ మందును ఎకరానికి 300 మిల్లీలీటర్ల మోతాదులో పిచికారీ చేస్తే తెగుళ్లను సమర్థంగా నియంత్రించవచ్చని వ్యవసాయాధికారి తెలిపారు.

రైతులు అప్రమత్తంగా ఉండి పంటను రక్షించుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News