Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:29 PM

ఛలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

ఛలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ

ఛలో ఇందిరా పార్క్ పోస్టర్ ఆవిష్కరణ
April 14, 2026 05:50 PM 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా విద్యా హక్కుల పోరాటానికి పిలుపు

సూర్యాపేట: విద్యార్థులపై పెరుగుతున్న ఫీజుల భారం, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుడుతూ “ఛలో ఇందిరా పార్క్” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య ప్రతి ఒక్కరికీ మౌలిక హక్కు కావాలని, కానీ ప్రస్తుతం అది వ్యాపారంగా మారిపోవడం బాధాకరమని అన్నారు.

ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న “ఫీజుల దోపిడీపై పోరు – విద్యా హక్కు సాధనకై ధర్నా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొన్నే మంజుల గౌడ్, టౌన్ అధ్యక్షుడు కుంభం నాగరాజు, మండలాధ్యక్షులు బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, మహిళా నాయకురాలు వర్రె కవిత, బొమ్మగాని సైదులు, వెంకటేశ్, సూపర్ సైదులు, వట్యాల శేఖర్, నెలచర్ల మధు, బానోత్ ఛాంప్ల, పగిళ్ల శరత్, లింగాల సైదులు, వట్టే లింగరాజు, బోడపట్ల మధు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News