చలో ఢిల్లీ విజయవంతం చేయాలి: బీసీ సంఘాల పిలుపు
చలో ఢిల్లీ విజయవంతం చేయాలి: బీసీ సంఘాల పిలుపు
Editor Desk
చౌటుప్పల్ బస్టాండ్ వద్ద సాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. మార్చి 30, 31 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో సెమినార్, జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అలాగే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, కుల గణన నిర్వహించడం, దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడం, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తగిన నిధులు కేటాయించడం లేదని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజిక వేత ఉద్యమకారుడు బెల్లి చంద్రశేఖర్, బీసీ యువజన సంఘం ఉమ్మడిజిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలకల శ్రీనివాస్,దాసరి లవ్లేష్, దాసరి శ్రీనివాస్, గోగు లింగం, బెల్లి మధుకర్,మహేష్, నరారి మల్లేష్, వీరయ్య, సైదుల్ గౌడ్, విగ్నేష్, సత్తయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి