Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 10:06 PM

చలో ఢిల్లీ విజయవంతం చేయాలి: బీసీ సంఘాల పిలుపు

చలో ఢిల్లీ విజయవంతం చేయాలి: బీసీ సంఘాల పిలుపు

చలో ఢిల్లీ విజయవంతం చేయాలి: బీసీ సంఘాల పిలుపు
March 26, 2026 08:34 PM 1 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ బస్టాండ్ వద్ద సాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. మార్చి 30, 31 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో సెమినార్, జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అలాగే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, కుల గణన నిర్వహించడం, దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడం, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తగిన నిధులు కేటాయించడం లేదని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, సామాజిక వేత ఉద్యమకారుడు బెల్లి చంద్రశేఖర్, బీసీ యువజన సంఘం ఉమ్మడిజిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలకల శ్రీనివాస్,దాసరి లవ్లేష్, దాసరి శ్రీనివాస్, గోగు లింగం, బెల్లి మధుకర్,మహేష్, నరారి మల్లేష్, వీరయ్య, సైదుల్ గౌడ్, విగ్నేష్, సత్తయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News