చలి వేళ వరి నారుమడిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి: ఏజాజ్ అలీ ఖాన్
చలి వేళ వరి నారుమడిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి: ఏజాజ్ అలీ ఖాన్
స్థానికం బృందం
ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారి తనిఖీలు
రామన్నపేట – స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండల వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో నిర్వహిస్తున్న స్టాక్, అమ్మకాల రికార్డులను పరిశీలించి, సరైన విధంగా మెయింటెనెన్స్ కొనసాగిస్తున్నందుకు దుకాణదారులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
తనిఖీల అనంతరం ఆయన రైతులకు ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరి నారుమడి పెంపకంలో రైతులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మూసినీరు, మరికొన్ని ప్రాంతాల్లో బోరుబావి నీరు ఉండటం, చలి ప్రభావంతో వరి నారుకు అవసరమైన సూక్ష్మ పోషకాలు అందక ఎదుగుదల లోపించే అవకాశం ఉందన్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ పంట పొలాల పరిస్థితిని స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వరి నారుమడికి చిలేటెడ్ జింక్ వినియోగించాలని, అలాగే 19-19-19 లేదా 13-0-45 వంటి నీటిలో కరిగే ఎరువులను ఉపయోగించాలని తెలిపారు.
ఒక లీటర్ నీటికి
5 గ్రాముల చిలేటెడ్ జింక్,
1.5 గ్రాముల 19-19-19 లేదా 13-0-45 చొప్పున కలిపి నారుమడిపై స్ప్రే చేయాలని సూచించారు.
ఈ విధంగా సూక్ష్మ పోషకాలు అందిస్తే నారుమడికి రోగాలు, చీడపురుగుల బెడద తగ్గడంతో పాటు మంచి ఎదుగుదల వస్తుందని తెలిపారు. చలి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు వరి నారుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వ్యవసాయ అధికారి సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి