Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:45 PM

చలి తీవ్రతతో వరిలో నారుమడులకు ముప్పు – రైతులు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలు.మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్

చలి తీవ్రతతో వరిలో నారుమడులకు ముప్పు – రైతులు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలు.మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్

చలి తీవ్రతతో వరిలో నారుమడులకు ముప్పు – రైతులు తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలు.మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్
December 31, 2025 09:01 AM 84 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట: వరిలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నారుమడుల యాజమాన్యం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం, మంచు కురిసే పరిస్థితుల్లో నారుమడులు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అవుతున్నాయని తెలిపారు.

చలి ప్రభావాన్ని తగ్గించేందుకు రాత్రి వేళల్లో నారుమడిలోని నీటిని తీసివేసి, తెల్లవారు జామున తాజా నీటిని పెట్టాలి. దీంతో నారుమడిలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి మొక్కలు చలికి దెబ్బతినకుండా ఉంటాయని వివరించారు.

అలాగే నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతం ఇచ్చి, వాటిపై పలుచని పాలిథీన్ షీట్ లేదా యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం వేళల్లో కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలని సూచించారు. ఇది చలి గాలుల ప్రభావాన్ని తగ్గించి నారుమడులను కాపాడుతుందని చెప్పారు.

మంచు కురుస్తున్న సమయంలో ఆకులపై బూడిద (Ash) చల్లడం ద్వారా మంచు ప్రభావాన్ని కొంత మేర తగ్గించవచ్చని తెలిపారు. అలాగే చలికాలంలో తరచుగా కనిపించే జింకు లోపం సవరణకు లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేటు కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

నారుమడులు ఆరోగ్యంగా పెరగాలంటే పైపాటుగా 2 కిలోల యూరియా + 2 గ్రాముల కార్బండాజిమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని కలిపి వినియోగించాలి. అదేవిధంగా 19:19:19 ఎరువును 4–5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా మొక్కలకు సమతుల్య పోషకాలు అందుతాయని తెలిపారు.

చలి కారణంగా వచ్చే అబియోటిక్, బయోటిక్ స్ట్రెస్ తగ్గించడంలో Isabion (అమినో ఆమ్లాలు + పెప్టైడ్స్) కీలకంగా ఉపయోగపడుతుందని, దీనిని లీటరు నీటికి 1.0–1.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలని సూచించారు.

ఈ సూచనలను క్రమబద్ధంగా అమలు చేస్తే, చలి తీవ్రత ఉన్నా సరే వరిలో నారుమడులు సురక్షితంగా పెరిగి మంచి దిగుబడులు సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News