Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:53 PM

చదువుతో పాటు క్రీడలు అవసరం – సీఎం కప్ ప్రారంభంలో ఎమ్మెల్యే పిలుపు

చదువుతో పాటు క్రీడలు అవసరం – సీఎం కప్ ప్రారంభంలో ఎమ్మెల్యే పిలుపు

చదువుతో పాటు క్రీడలు అవసరం – సీఎం కప్ ప్రారంభంలో ఎమ్మెల్యే పిలుపు
February 05, 2026 01:45 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ ప్రతి నియోజకవర్గంలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను ఈ రోజు నారాయణఖేడ్ మండలంలోని జుక్కల్ శివారులో ఉన్న రెసిడెన్షియల్ కళాశాల మైదానంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,నారాయణఖేడ్ నియోజకవర్గంలో గతంలో కూడా జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆ పోటీలలో ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని సూచించారు.మన నియోజకవర్గానికి అతి త్వరలోనే ఆధునిక వసతులతో కూడిన ఇండోర్ మరియు ఔట్‌డోర్ క్రీడా మైదానాలను మంజూరు చేయించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ప్రజా ప్రభుత్వం యువత అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.విద్య, క్రీడలు,ఆరోగ్యం అన్నింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఈ పోటీలలో పాల్గొని విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నారాయణఖేడ్ మండల రెవెన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి, మండల విద్యా అధికారి, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, క్రీడాకారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News