Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 01:47 AM

చదువుల తల్లి సరస్వతిని ప్రతి విద్యార్థులు, విద్యార్థినిలు పూజించాలి- కార్పొరేటర్ మేకల సునీత

చదువుల తల్లి సరస్వతిని ప్రతి విద్యార్థులు, విద్యార్థినిలు పూజించాలి- కార్పొరేటర్ మేకల సునీత

చదువుల తల్లి సరస్వతిని ప్రతి విద్యార్థులు, విద్యార్థినిలు పూజించాలి- కార్పొరేటర్ మేకల సునీత
January 23, 2026 08:46 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్

ప్రతి ఒక్క విద్యార్థి చదువుల తల్లి సరస్వతిని పూజించాలని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ తెలిపారు. వసంత పంచమి సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని సంతోష్ నగర్ లో గల అంబా భవాని ఆలయంలో విజయ మేరీ స్కూల్ విద్యార్థులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై అంబా భవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు కిట్టు, కన్నా, రాము, నాగభూషణం తోపాటు, బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News