స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్
ప్రతి ఒక్క విద్యార్థి చదువుల తల్లి సరస్వతిని పూజించాలని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ తెలిపారు. వసంత పంచమి సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని సంతోష్ నగర్ లో గల అంబా భవాని ఆలయంలో విజయ మేరీ స్కూల్ విద్యార్థులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై అంబా భవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు కిట్టు, కన్నా, రాము, నాగభూషణం తోపాటు, బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి