Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:58 AM

బోగారం గ్రామంలో భక్తిరసభరితంగా సీతారాముల కళ్యాణం

బోగారం గ్రామంలో భక్తిరసభరితంగా సీతారాముల కళ్యాణం

బోగారం గ్రామంలో భక్తిరసభరితంగా సీతారాముల కళ్యాణం
27-03-2026 168 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నేతృత్వంలో వైభవంగా వేడుకలు

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బో గారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నేతృత్వం వహించారు.

ఉదయం రామాలయంలో గణపతి హోమంతో ప్రారంభమైన కార్యక్రమాలు రేణుక ఎల్లమ్మ తల్లికి టెంకాయల సమర్పణ, బొడ్రాయి పూజలతో కొనసాగాయి. అనంతరం హోమం నిర్వహించి స్వామివారి ఎదురుకోలు ఘనంగా జరిపారు.

ముత్యాల పందిరిలో జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులను ఆకట్టుకుంది. దేవాలయ ప్రాంగణంలో శ్రీరామ నామస్మరణ మారుమోగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని కనులపండువగా మార్చారు.

తదనంతరం 1993-94 ఏడవ తరగతి బ్యాచ్ సభ్యులు అన్నదానం నిర్వహించారు. మహిళలు, యువత, గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, కనుకు మల్లేశం, మేడి ఆంజనేయులు, కడారి పావని పాపయ్య, వనం అండాలు యాదగిరి, మాజీ సర్పంచ్ అంతటి పద్మా రమేష్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, అడ్వకేట్ కందగట్ల శ్రీనివాస్, కునూరు శ్రీనివాస్ గౌడ్, తెలుసూరి మల్లేష్ యాదవ్, గోగు మధు యాదవ్, గోగు సత్యనారాయణ యాదవ్, బద్దుల మహేష్ యాదవ్, అంతటి మల్లేశం గౌడ్, వనం నరసింహ, గండూరి వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి రాజు, మేడి కృష్ణ, చెరుకు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోగారం గ్రామంలో భక్తిరసభరితంగా సీతారాముల కళ్యాణం

Article Image

సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నేతృత్వంలో వైభవంగా వేడుకలు

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బో గారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నేతృత్వం వహించారు.

ఉదయం రామాలయంలో గణపతి హోమంతో ప్రారంభమైన కార్యక్రమాలు రేణుక ఎల్లమ్మ తల్లికి టెంకాయల సమర్పణ, బొడ్రాయి పూజలతో కొనసాగాయి. అనంతరం హోమం నిర్వహించి స్వామివారి ఎదురుకోలు ఘనంగా జరిపారు.

ముత్యాల పందిరిలో జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులను ఆకట్టుకుంది. దేవాలయ ప్రాంగణంలో శ్రీరామ నామస్మరణ మారుమోగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని కనులపండువగా మార్చారు.

తదనంతరం 1993-94 ఏడవ తరగతి బ్యాచ్ సభ్యులు అన్నదానం నిర్వహించారు. మహిళలు, యువత, గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, కనుకు మల్లేశం, మేడి ఆంజనేయులు, కడారి పావని పాపయ్య, వనం అండాలు యాదగిరి, మాజీ సర్పంచ్ అంతటి పద్మా రమేష్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, అడ్వకేట్ కందగట్ల శ్రీనివాస్, కునూరు శ్రీనివాస్ గౌడ్, తెలుసూరి మల్లేష్ యాదవ్, గోగు మధు యాదవ్, గోగు సత్యనారాయణ యాదవ్, బద్దుల మహేష్ యాదవ్, అంతటి మల్లేశం గౌడ్, వనం నరసింహ, గండూరి వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి రాజు, మేడి కృష్ణ, చెరుకు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News