Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీతారాముల కళ్యాణంలో పుస్తె మెట్టెల సమర్పణ శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 08:53 PM

బోగారం గ్రామంలో భక్తిరసభరితంగా సీతారాముల కళ్యాణం

బోగారం గ్రామంలో భక్తిరసభరితంగా సీతారాముల కళ్యాణం

బోగారం గ్రామంలో భక్తిరసభరితంగా సీతారాముల కళ్యాణం
March 27, 2026 06:55 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నేతృత్వంలో వైభవంగా వేడుకలు

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బో గారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ నేతృత్వం వహించారు.

ఉదయం రామాలయంలో గణపతి హోమంతో ప్రారంభమైన కార్యక్రమాలు రేణుక ఎల్లమ్మ తల్లికి టెంకాయల సమర్పణ, బొడ్రాయి పూజలతో కొనసాగాయి. అనంతరం హోమం నిర్వహించి స్వామివారి ఎదురుకోలు ఘనంగా జరిపారు.

ముత్యాల పందిరిలో జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులను ఆకట్టుకుంది. దేవాలయ ప్రాంగణంలో శ్రీరామ నామస్మరణ మారుమోగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని కనులపండువగా మార్చారు.

తదనంతరం 1993-94 ఏడవ తరగతి బ్యాచ్ సభ్యులు అన్నదానం నిర్వహించారు. మహిళలు, యువత, గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల, రమేష్ యాదవ్, కనుకు మల్లేశం, మేడి ఆంజనేయులు, కడారి పావని పాపయ్య, వనం అండాలు యాదగిరి, మాజీ సర్పంచ్ అంతటి పద్మా రమేష్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, అడ్వకేట్ కందగట్ల శ్రీనివాస్, కునూరు శ్రీనివాస్ గౌడ్, తెలుసూరి మల్లేష్ యాదవ్, గోగు మధు యాదవ్, గోగు సత్యనారాయణ యాదవ్, బద్దుల మహేష్ యాదవ్, అంతటి మల్లేశం గౌడ్, వనం నరసింహ, గండూరి వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి రాజు, మేడి కృష్ణ, చెరుకు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News