బోగారం గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన
బోగారం గ్రామంలో అభివృద్ధి పనుల పరిశీలన
స్థానికం బృందం
99 రోజుల కార్యాచరణలో భాగంగా పాఠశాల, అంగన్వాడి, నర్సరీ తనిఖీ చేసిన సర్పంచ్
రామన్నపేట మండలం:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో 99 రోజుల ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీ సిబ్బందికి శాలువాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సర్పంచ్ విద్యార్థుల చదువు, పరిశుభ్రత, మధ్యాహ్న భోజన మెనూ తదితర అంశాలపై ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు అవసరమైన సూచనలు చేశారు.
అలాగే అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడి సిబ్బందికి సూచించారు. తల్లిదండ్రులకు కూడా పిల్లల ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన కల్పించాలని తెలిపారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ క్షేత్రాన్ని పరిశీలించి మొక్కల సంరక్షణపై తగు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్, కనుక మల్లేశం, మేడి ఆంజనేయులు దేవి, నేరటి మానస సురేష్, కడారి పావని పాపయ్య, గోగు సురేష్, చిరగొని కల్పన నవీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి