బోధి స్కూల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం – ప్రజలకు చల్లని తాగునీటి సేవ
బోధి స్కూల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం – ప్రజలకు చల్లని తాగునీటి సేవ
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో బోధి స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు స్కూల్ యాజమాన్యం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణఖేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని, బోధి స్కూల్ యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు,పోలీస్ సిబ్బంది,విద్యార్థులు మరియు స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వేసవి కాలంలో ప్రజలకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి