బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు.
బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు.
Sr.Journalist YVN
రాజాం: బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అమ్మవారి 100వ జాతర మహోత్సవ ఏర్పాట్లు చేయనున్న సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి జాతరను ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పూనుకున్నట్లు తెలిపారు.ఈ జాతరను రాష్ట్ర పండుగగా చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని గారిని కలిసి వినతి అందజేసినట్లు తెలిపారు.అలాగే అధినేత చంద్రబాబు దృష్టిలో పెడతానని తెలిపారు. ఈ 100వ జాతర మహోత్సవాన్ని ప్రజలు మరచిపోలేని విధంగా చేసేందుకు కృషి చేస్తానన్నారు. దీనికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ,పెద్దలు,ప్రజలు సహకరించాలన్నారు.జాతర ఏర్పాట్లకోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 22నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్నాయని, ఫిబ్రవరి 24వ తేదీతో ఘటోత్సవంతో అమ్మవారి జాతర ముగుస్తుందన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి