Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:05 AM

బండచెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

బండచెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

బండచెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
16-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని బండచెరువును పరిరక్షిస్తూ ఆధునికరించాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు.

బుద్ధ భవన్‌లో హైడ్రా కమిషనర్ ఎ .వి.రంగనాథ్, ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి బండచెరువు సమస్యలపై ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.

చెరువులో ప్రస్తుతం పేరుకుపోయిన గుర్రపు డెక్క (చెత్త, మట్టిపొరలు) కారణంగా చెరువు పర్యావరణం దెబ్బతింటోందని, దీని వల్ల స్థానిక ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని ఎమ్మెల్యే కమిషనర్ కి వివరించారు. చెరువులోని గుర్రపు డెక్కను తొలగించి, చెరువును పరిరక్షిస్తూ ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని కోరారు.

ఎమ్మెల్యే సమర్పించిన వినతిపత్రంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని చెరువులు, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Sthanikam

బండచెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Article Image

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని బండచెరువును పరిరక్షిస్తూ ఆధునికరించాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు.

బుద్ధ భవన్‌లో హైడ్రా కమిషనర్ ఎ .వి.రంగనాథ్, ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి బండచెరువు సమస్యలపై ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.

చెరువులో ప్రస్తుతం పేరుకుపోయిన గుర్రపు డెక్క (చెత్త, మట్టిపొరలు) కారణంగా చెరువు పర్యావరణం దెబ్బతింటోందని, దీని వల్ల స్థానిక ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని ఎమ్మెల్యే కమిషనర్ కి వివరించారు. చెరువులోని గుర్రపు డెక్కను తొలగించి, చెరువును పరిరక్షిస్తూ ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని కోరారు.

ఎమ్మెల్యే సమర్పించిన వినతిపత్రంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని చెరువులు, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News