PRINT TIME: April 11, 2026 04:46 PM
బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక
బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక
February 01, 2026 08:52 AM
22 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
నాలుగో వార్డులో కాంగ్రెస్ బలోపేతం
సూర్యాపేట పట్టణం నాలుగో వార్డుకు చెందిన బిజెపి నాయకుడు శ్రీ రాములు బిజెపి పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకొని అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నాయకులు తెలిపారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి