బిజెపి అభ్యర్థిగా కూరెళ్ళ శీను నామినేషన్ దాఖలు
బిజెపి అభ్యర్థిగా కూరెళ్ళ శీను నామినేషన్ దాఖలు
Komidala Mahender reddy
చిట్యాల మునిసిపాలిటీలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో 9వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా కూరెళ్ళ శ్రీను తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ కార్యక్రమంలో సంఘ సేవకుడు, హిందూ ధర్మ రక్షకులు భానుక ఉదయ్, భానుకా రేఖ ముఖ్య అతిథులుగా పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ, వార్డులో అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా కూరెళ్ళ శ్రీను ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.
నామినేషన్ అనంతరం కూరెళ్ళ శ్రీను మాట్లాడుతూ, 9వ వార్డును అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పరిశుభ్రత, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 9వ వార్డు కుటుంబ సభ్యులందరూ తనకు ఆశీర్వాదాలు, మద్దతు అందించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి