బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
Biksham
సూర్యాపేట మున్సిపాలిటీలో చేరికల పర్వం
సూర్యాపేట
ఈ రోజు సూర్యాపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరియు మున్సిపాలిటీ సమన్వయకర్త ఇస్లావత్ రామచందర్ నాయక్ ఆధ్వర్యంలో వివిధ మున్సిపల్ వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు. సూర్యాపేట పట్టణ అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ చేసిన కృషిని గుర్తించి ప్రజలు విశ్వాసం ప్రకటిస్తున్నారన్నారు.మున్సిపాలిటీలో అన్ని వార్డులలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో సూర్యాపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ మరింత బలంగా నిలవనున్నదని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ వార్డు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి