బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీ చేరికలు
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీ చేరికలు
Biksham
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్లో బుధవారం కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, 31వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొండపల్లి దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వెన్న కవిత శ్రీనివాస్ రెడ్డి, గుండు స్వరూప్ రెడ్డి, వారితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కొత్తగా చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోదల రంగారెడ్డి, కుంభం అనీల్ కుమార్ రెడ్డి, వీరేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి