Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:27 AM

భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు

భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు

భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు
23-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:

భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రధానమంత్రి సంసద్ ఖేల్’ మహోత్సవంలో విజేతలకు బహుమతులు అందజేశారు.

భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, కోకో తదితర క్రీడల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్న క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా మోత్కూర్ మండలం దత్తప్పగూడ గ్రామానికి చెందిన క్రీడాకారులు వాలీబాల్‌లో ప్రథమ, కబడ్డీలో ద్వితీయ స్థానాలు సాధించి రూ.75,000 నగదు బహుమతిని అందుకున్నారు.

విజేతలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తుంగతుర్తి ఇన్‌చార్జ్ కడియం రామచంద్రయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్, మోత్కూర్ మండల అధ్యక్షుడు గూదే మధుసూదన్ యాదవ్, ఉపాధ్యక్షులు గుంటి సతీష్, రాధారపు మల్లేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు

Article Image

భువనగిరి:

భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రధానమంత్రి సంసద్ ఖేల్’ మహోత్సవంలో విజేతలకు బహుమతులు అందజేశారు.

భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, కోకో తదితర క్రీడల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్న క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా మోత్కూర్ మండలం దత్తప్పగూడ గ్రామానికి చెందిన క్రీడాకారులు వాలీబాల్‌లో ప్రథమ, కబడ్డీలో ద్వితీయ స్థానాలు సాధించి రూ.75,000 నగదు బహుమతిని అందుకున్నారు.

విజేతలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తుంగతుర్తి ఇన్‌చార్జ్ కడియం రామచంద్రయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్, మోత్కూర్ మండల అధ్యక్షుడు గూదే మధుసూదన్ యాదవ్, ఉపాధ్యక్షులు గుంటి సతీష్, రాధారపు మల్లేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News