భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు
భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు
Editor Desk
భువనగిరి:
భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రధానమంత్రి సంసద్ ఖేల్’ మహోత్సవంలో విజేతలకు బహుమతులు అందజేశారు.
భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, కోకో తదితర క్రీడల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్న క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా మోత్కూర్ మండలం దత్తప్పగూడ గ్రామానికి చెందిన క్రీడాకారులు వాలీబాల్లో ప్రథమ, కబడ్డీలో ద్వితీయ స్థానాలు సాధించి రూ.75,000 నగదు బహుమతిని అందుకున్నారు.
విజేతలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తుంగతుర్తి ఇన్చార్జ్ కడియం రామచంద్రయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్, మోత్కూర్ మండల అధ్యక్షుడు గూదే మధుసూదన్ యాదవ్, ఉపాధ్యక్షులు గుంటి సతీష్, రాధారపు మల్లేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి