Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:20 AM

భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు

భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు

భువనగిరిలో ‘సంసద్ ఖేల్’ విజేతలకు బహుమతులు
March 23, 2026 06:15 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:

భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రధానమంత్రి సంసద్ ఖేల్’ మహోత్సవంలో విజేతలకు బహుమతులు అందజేశారు.

భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, కోకో తదితర క్రీడల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్న క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా మోత్కూర్ మండలం దత్తప్పగూడ గ్రామానికి చెందిన క్రీడాకారులు వాలీబాల్‌లో ప్రథమ, కబడ్డీలో ద్వితీయ స్థానాలు సాధించి రూ.75,000 నగదు బహుమతిని అందుకున్నారు.

విజేతలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తుంగతుర్తి ఇన్‌చార్జ్ కడియం రామచంద్రయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్, మోత్కూర్ మండల అధ్యక్షుడు గూదే మధుసూదన్ యాదవ్, ఉపాధ్యక్షులు గుంటి సతీష్, రాధారపు మల్లేష్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News