భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం భువనగిరి కొత్త బస్టాండ్లో ప్రజలు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సమితి కన్వీనర్లు సోమ కృష్ణమూర్తి, రాచమల్ల వినోద్కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో బుస్స శ్రీనివాస్, అరుణ్ కిషోర్, ఎన్. విజయ్కుమార్, సీహెచ్ రాజు, శ్రీధర్, మోహన్, సీహెచ్ ప్రవీణ, పి. రజని, సోమ సరస్వతి, వాకిటి అరుణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి