Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:10 AM

భువనగిరి జాతీయ లోక్ అదాలత్‌లో 2,193 కేసులకు పరిష్కారం

భువనగిరి జాతీయ లోక్ అదాలత్‌లో 2,193 కేసులకు పరిష్కారం

భువనగిరి జాతీయ లోక్ అదాలత్‌లో 2,193 కేసులకు పరిష్కారం
March 28, 2026 08:38 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యదాద్రి-భువనగిరి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎ. జయరాజు ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది. బోనగిరి కోర్టు ఆవరణలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో న్యాయమూర్తి స్వయంగా ఒక కేసును పరిష్కరిస్తూ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు మాట్లాడుతూ, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. చిన్న చిన్న వివాదాలను పరస్పర రాజీతో స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 2,193 కేసులు పరిష్కరించబడ్డాయి. వీటిలో 7 సివిల్ కేసులు, 2,163 క్రిమినల్ కేసులు, 23 పీఎల్‌సీ కేసులు ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, రెండవ తరగతి మెజిస్ట్రేట్ జ్యోతిరావు, లోక్ అదాలత్ సభ్యులు జి. నాగేంద్రమ్మ, కె. మల్లేష్, సి.హెచ్. ఐలయ్య, కె. గోపాల్ రావు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News