Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.54.75 కోట్ల బడ్జెట్ ఆమోదం అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 10:46 PM

భువనగిరి జాతీయ లోక్ అదాలత్‌లో 2,193 కేసులకు పరిష్కారం

భువనగిరి జాతీయ లోక్ అదాలత్‌లో 2,193 కేసులకు పరిష్కారం

భువనగిరి జాతీయ లోక్ అదాలత్‌లో 2,193 కేసులకు పరిష్కారం
March 28, 2026 08:38 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యదాద్రి-భువనగిరి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ఎ. జయరాజు ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది. బోనగిరి కోర్టు ఆవరణలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో న్యాయమూర్తి స్వయంగా ఒక కేసును పరిష్కరిస్తూ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు మాట్లాడుతూ, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. చిన్న చిన్న వివాదాలను పరస్పర రాజీతో స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 2,193 కేసులు పరిష్కరించబడ్డాయి. వీటిలో 7 సివిల్ కేసులు, 2,163 క్రిమినల్ కేసులు, 23 పీఎల్‌సీ కేసులు ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, రెండవ తరగతి మెజిస్ట్రేట్ జ్యోతిరావు, లోక్ అదాలత్ సభ్యులు జి. నాగేంద్రమ్మ, కె. మల్లేష్, సి.హెచ్. ఐలయ్య, కె. గోపాల్ రావు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News