భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్
భువనగిరి:భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ భువనగిరి పట్టణంలోని 35వ వార్డులో ఏర్పాటు చేసిన బోర్ పంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో భువనగిరి పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ బోర్ ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చైర్మన్కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగల్పల్లి రవికుమార్,కుమార్ హమీద్,స్థానిక వార్డు సభ్యులు,మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి