Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:05 PM

భూ వివాదంలో మద్యం డిమాండ్.. ఎస్సైపై చర్యలు

భూ వివాదంలో మద్యం డిమాండ్.. ఎస్సైపై చర్యలు

భూ వివాదంలో మద్యం డిమాండ్.. ఎస్సైపై చర్యలు
13-04-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మీర్‌పేటలో భూ ఆక్రమణపై ఫిర్యాదు చేసిన బాధితుడి నుంచి మద్యం సీసాలు డిమాండ్ చేసిన ఎస్సై నాగభూషణం వ్యవహారం సంచలనంగా మారింది. న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసు అధికారి ఇలాంటి చర్యకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.11 గజాల స్థలం వివాదంలో బాధితుడికి సహాయం చేయాల్సింది పోయి, ఫోన్ చేసి మరీ మద్యం పంపించాలని ఒత్తిడి చేసిన ఆడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారి ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్, ఎస్సై నాగభూషణంను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

భూ వివాదంలో మద్యం డిమాండ్.. ఎస్సైపై చర్యలు

Article Image

మీర్‌పేటలో భూ ఆక్రమణపై ఫిర్యాదు చేసిన బాధితుడి నుంచి మద్యం సీసాలు డిమాండ్ చేసిన ఎస్సై నాగభూషణం వ్యవహారం సంచలనంగా మారింది. న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసు అధికారి ఇలాంటి చర్యకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.11 గజాల స్థలం వివాదంలో బాధితుడికి సహాయం చేయాల్సింది పోయి, ఫోన్ చేసి మరీ మద్యం పంపించాలని ఒత్తిడి చేసిన ఆడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారి ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్, ఎస్సై నాగభూషణంను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News