భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Vikram
లైసెన్స్ సర్వేయర్లతో సమీకృత కలెక్టరేట్లో సమావేశం
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
గ్రామాలలో భూమి కొలతల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన మొదటి బ్యాచ్ లైసెన్స్ సర్వేయర్ల 45 రోజుల శిక్షణ పూర్తైన సందర్భంగా, బుధవారం సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరై మాట్లాడుతూ, శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు నూతన నైపుణ్యాలతో భూభారతి, ధరణి, ఎల్ఆర్పీ సమస్యలు ఉన్న భూములను సర్వే చేసి ఖచ్చితమైన నివేదికలు అందించాలని సూచించారు. భూ కొలతల్లో స్పష్టత, స్థిరమైన పరిష్కారం ఉండేలా పనిచేయాలని అన్నారు. గ్రామ స్థాయిలో తహసిల్దార్లు, జిపిఓల సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి, రైతుల్లో విశ్వాసం కలిగేలా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి, సూర్యాపేట జిల్లాను భూమి రికార్డుల నిర్వహణలో ముందు వరుసలో నిలబెట్టేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి