Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:54 AM

భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
January 21, 2026 07:11 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

లైసెన్స్ సర్వేయర్లతో సమీకృత కలెక్టరేట్‌లో సమావేశం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

గ్రామాలలో భూమి కొలతల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన మొదటి బ్యాచ్ లైసెన్స్ సర్వేయర్ల 45 రోజుల శిక్షణ పూర్తైన సందర్భంగా, బుధవారం సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరై మాట్లాడుతూ, శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు నూతన నైపుణ్యాలతో భూభారతి, ధరణి, ఎల్‌ఆర్‌పీ సమస్యలు ఉన్న భూములను సర్వే చేసి ఖచ్చితమైన నివేదికలు అందించాలని సూచించారు. భూ కొలతల్లో స్పష్టత, స్థిరమైన పరిష్కారం ఉండేలా పనిచేయాలని అన్నారు. గ్రామ స్థాయిలో తహసిల్దార్‌లు, జిపిఓల సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి, రైతుల్లో విశ్వాసం కలిగేలా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి, సూర్యాపేట జిల్లాను భూమి రికార్డుల నిర్వహణలో ముందు వరుసలో నిలబెట్టేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News