Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:17 PM

భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
January 21, 2026 07:11 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

లైసెన్స్ సర్వేయర్లతో సమీకృత కలెక్టరేట్‌లో సమావేశం

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

గ్రామాలలో భూమి కొలతల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన మొదటి బ్యాచ్ లైసెన్స్ సర్వేయర్ల 45 రోజుల శిక్షణ పూర్తైన సందర్భంగా, బుధవారం సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరై మాట్లాడుతూ, శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు నూతన నైపుణ్యాలతో భూభారతి, ధరణి, ఎల్‌ఆర్‌పీ సమస్యలు ఉన్న భూములను సర్వే చేసి ఖచ్చితమైన నివేదికలు అందించాలని సూచించారు. భూ కొలతల్లో స్పష్టత, స్థిరమైన పరిష్కారం ఉండేలా పనిచేయాలని అన్నారు. గ్రామ స్థాయిలో తహసిల్దార్‌లు, జిపిఓల సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి, రైతుల్లో విశ్వాసం కలిగేలా విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్లపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి, సూర్యాపేట జిల్లాను భూమి రికార్డుల నిర్వహణలో ముందు వరుసలో నిలబెట్టేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News