భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య
భవనం పై నుండి దూకి మహిళ ఆత్మహత్య
Editor Desk
తను నివాసం ఉంటున్న పైన భవనం పైనుండి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్ పెక్టర్ కె. సైదులు తెలిపిన వివరాల ప్రకారం మన్య శివకుమార్ భార్య మన్య మాధవి అలియాస్ చందన,(31) చైతన్యపురిలోని హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 25 న ఉదయము సుమారు 6:30 గంటల సమయములో మాధవి కుటుంబ కలహాల నేపథ్యములో వాళ్ళు నివాసం ఉంటున్న భవనం పైనుండి క్రిందకు దూకగా, బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త శివకుమార్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా చికిత్స పొందుచూ ఉదయము 10:40 గంటల సమయములో మృతిచెందింది. నా కుమార్తె మృతికి ఆమె భర్త శివకుమార్ కారణమని అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తండ్రి బాశెట్టి శ్రీను తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి