భారత రాష్ట్ర సమితికి గుడ్బై
భారత రాష్ట్ర సమితికి గుడ్బై
Biksham
కాంగ్రెస్ పార్టీలోకి నూకల శ్రీను, సారగండ్ల వెంకటమ్మ చేరిక
జాతీయ కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిని వీడి నూకల శ్రీను, సారగండ్ల వెంకటమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ అని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చి పలువురు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొణతం రాజేష్ రెడ్డి విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నూతనంగా పార్టీలో చేరిన నూకల శ్రీను, సారగండ్ల వెంకటమ్మ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను వివరించి, అభ్యర్థి గెలుపుకు శ్రమిస్తామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రజా పాలనను మరింత బలోపేతం చేస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిని అభినందిస్తూ, వారి సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందని వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి