భక్త రామదాసు ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా
భక్త రామదాసు ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా
Biksham
నేలకొండపల్లి:
భక్త రామదాసు ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటంతో హాజరుకాలేకపోయినప్పటికీ, తన శుభాకాంక్షలు తెలియజేశారు.మంత్రివర్యుల సహకారంతో కూసుమంచి శిబిర కార్యాలయ బాధ్యులు భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వెన్నపూసల సీతారాములు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆదాయ పరిశీలకుడు మధుసూదన్, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్, బి ఆర్ ఎస్, బి జె పి పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి