Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

భజనలు, కీర్తనలు, జైజైకారాలతో నారాయణఖేడ్ పట్టణం భక్తిమయంగా మారింది

భజనలు, కీర్తనలు, జైజైకారాలతో నారాయణఖేడ్ పట్టణం భక్తిమయంగా మారింది

భజనలు, కీర్తనలు, జైజైకారాలతో నారాయణఖేడ్ పట్టణం భక్తిమయంగా మారింది
January 14, 2026 08:05 PM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:అంతర్గావ్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ దివ్య సాన్నిధ్యంలో ఈ రోజు మాఘ మాసంలో ప్రసిద్ధి పొందిన పండరిపుర్ పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది.నారాయణఖేడ్ పట్టణంలో భజనలు,కీర్తనలు,జైజైకారాలతో పాటు భక్తుల ఉత్సాహభరిత సందోహం మధ్య పాదయాత్రకు శుభారంభం పలికింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో మాజీ శాసనసభ్యులు విజయ్ పాల్ రెడ్డి ముఖ్యంగా పాల్గొన్నారు.సభలో ప్రసంగిస్తూ, భక్తి కృపతో పండరీనాథ విఠలేశ్వరుని దివ్య సహకారం వ్యక్తిగత జీవితం, కుటుంబం, మరియు సామాజిక సంబంధాల్లో సుఖశాంతి, సహనం, సౌహార్దం, ధర్మబద్ధతను పెంపొందిస్తుందని వివరించారు. భగవాన్ పండరీనాథుని నామస్మరణ ద్వారా మానవ జీవితానికి స్పష్టమైన దిశానిర్దేశం లభిస్తుందని ఆయన తెలిపారు. అలాగే, ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడం తనకు అపూర్వ అదృష్టం లభించినట్లు ఆయన వ్యాఖ్యానించారు.ఈ రోజు ప్రారంభమైన పాదయాత్రలో అనేక మంది రాజకీయ రంగ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు. భక్తులందరూ పాదయాత్రలో భాగంగా స్వామివారి నామస్మరణ, భజన కీర్తనలతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ ముందుకు సాగుతున్నారు.పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక, భక్తుల ఏర్పాట్లు మరియు భద్రతా ఏర్పాట్లను చూసి, స్థానిక ప్రజలు మరియు నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News