భగత్సింగ్కు పోరాటమే నిజమైన నివాళి: జూలకంటి రంగారెడ్డి
భగత్సింగ్కు పోరాటమే నిజమైన నివాళి: జూలకంటి రంగారెడ్డి
Editor Desk
సామ్రాజ్యవాదం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటమే భగత్సింగ్కు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.
స్థానిక సుభాష్ సెంటర్లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భగత్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తులు విస్తరిస్తున్నాయని, బలహీన దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయని విమర్శించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్సింగ్ వంటి విప్లవ వీరులు ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని గుర్తుచేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మతోన్మాదం పెరిగి లౌకిక వ్యవస్థ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత భగత్సింగ్ స్ఫూర్తితో అన్యాయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు పుట్టల ఉదయ్కుమార్, శానగొండ రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి, సిపిఎం నాయకులు జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి