Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:59 AM

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత ముందుకు రావాలి

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత ముందుకు రావాలి

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత ముందుకు రావాలి
23-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముచ్చర్ల (ఖమ్మం జిల్లా),

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

పివైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో మండల కమిటీ ఆధ్వర్యంలో వీరమరణం పొందిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు మరణించి దాదాపు శతాబ్దం గడిచినా దేశంలో నిజమైన స్వాతంత్ర్యం సాధించలేదని వ్యాఖ్యానించారు. భగత్‌సింగ్‌లాంటి పోరాట చైతన్యం కలిగిన యువతరం దేశానికి అవసరమని అన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు. దేశ సంపద కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, యువత ఈ పరిస్థితులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

దేశ భవిష్యత్తు కోసం యువత మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సిద్ధం కావాలని, భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పివైఎల్ ఖమ్మం జిల్లా నాయకులు కోలా దర్గయ్య, కోటేష్, శేఖర్, గోపి, నాగులుమీరా, వెంకన్న, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత ముందుకు రావాలి

Article Image

ముచ్చర్ల (ఖమ్మం జిల్లా),

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల పోరాట స్ఫూర్తితో యువత ఉద్యమించాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

పివైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో మండల కమిటీ ఆధ్వర్యంలో వీరమరణం పొందిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు మరణించి దాదాపు శతాబ్దం గడిచినా దేశంలో నిజమైన స్వాతంత్ర్యం సాధించలేదని వ్యాఖ్యానించారు. భగత్‌సింగ్‌లాంటి పోరాట చైతన్యం కలిగిన యువతరం దేశానికి అవసరమని అన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు. దేశ సంపద కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, యువత ఈ పరిస్థితులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

దేశ భవిష్యత్తు కోసం యువత మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సిద్ధం కావాలని, భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పివైఎల్ ఖమ్మం జిల్లా నాయకులు కోలా దర్గయ్య, కోటేష్, శేఖర్, గోపి, నాగులుమీరా, వెంకన్న, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News